తెలుగు భాషా ప్రేమికులకు ఆహ్వానం

మీరు కంప్యూటర్లో తెలుగు చూడగలరా?

కంప్యూటర్ లో తెలుగు లో టైప్ చెయ్యగలరా?

మీ ఆన్‌లైన్ కార్యక్రమాలైన ఈ మెయిల్, చాటింగ్, సోషియల్ నెట్‌వర్క్స్, బ్లాగుల్లో తెలుగు వాడకం బాగా తెలుసా?

మొదటి సారి కంప్యూటర్లో తెలుగును చూసినప్పుడు మీరు ఎలాంటి ఆనందం అనుభవించారో అదే అనుభూతిని మరింత మందికి పంచండి!

ఈ నెల పదహారవ తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా లో భారీ పుస్తక ప్రదర్శన జరగనుంది. గత రెండేళ్ళుగా ఈ-తెలుగు సంస్థ అక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేసి అక్కడికి ఆసక్తితో వచ్చే సందర్శకులకు కరపత్రాలు, ప్రదర్శనల ద్వారా కంప్యూటర్లలో తెలుగు వాడకం గురించి, ఇంటర్నెట్ (అంతర్జాలం) లో లభ్యమౌతున్న తెలుగు వెబ్‌సైట్లు, తెలుగు భాషకు సంబంధించిన వివిధ ఉపకరణాల గురించి అవగాహన కలిగిస్తున్నది.

ఈ స్టాల్ లో సేవలు అందించేందుకు, సందర్శకులకు కంప్యూటర్లో తెలుగు గురించి పరిచయం చేయడానికి  స్వచ్చంద సేవకులకు ఆహ్వానం పలుకుతున్నాము. ఈ ప్రదర్శన జరిగే పది రోజుల్లో ఎప్పుడైనా, ఎంత సమయమైనా స్టాల్ దగ్గరికి వచ్చి మీ సేవలందించవచ్చు. మీరు చేయవలసిందల్లా అక్కడికి వచ్చిన వారికి ఒక కరపత్రాన్ని అందజేసి కంప్యూటర్లలో సులభంగా తెలుగు చూడవచ్చు, రాయవచ్చు అని తెలియజెప్పడం మాత్రమే!

తెలుగుబాట పట్టండి

తెలుగు బాట చిహ్నం
తెలుగు బాట చిహ్నం

ఈనెల 29 ఆదివారం గిడుగు రామ్మూర్తి గారి జయంతి సందర్భంగా కంప్యూటర్లలో, అంతర్జాలంలో తెలుగు వ్యాప్తి కోసం కృషి చేస్తున్న e-తెలుగు సంస్థ ఆధ్వర్యంలో తెలుగు బాట కార్యక్రమం నిర్వహిస్తున్నాం. భాషాభిమానులు మీ బంధు మిత్రులకు ఈ కార్యక్రమం గురించి తెలియజేసి,  విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రార్థన.

మే 2010, e-తెలుగు సమావేశం విశేషాలు

సమావేశానికి హాజరైన వారు

  1. వీవెన్ – వీవెనుడి టెక్కునిక్కులు
  2. సుజాత – మనసులో మాట
  3. సతీష్ యనమండ్ర – సనాతన భారతి
  4. అరిపిరాల సత్యప్రసాద్ – జోకాభిరామాయణం
  5. రవిచంద్ర – అంతర్వాహిని
  6. ప్రవీణ్ – సాహిత్య అవలోకనం
  7. కృపాల్ కశ్యప్ – కబుర్లు
  8. శ్రీనివాస రాజు – శ్రీనివాసీయం
  9. శ్రీనివాస కుమార్ – జీవితంలో కొత్తకోణం
  10. ఎమ్మెస్ నాయుడు – ఎమ్మెస్ నాయుడు
  11. శ్రీహర్ష – కిన్నెరసాని

ఇంకా ఔత్సాహికులు సాయిరాం (జ్యోతిష శాస్త్రజ్ఞులు), శ్రీకాంత్ పాల్గొన్నారు.

చర్చకు వచ్చిన అంశాలు:

  • ముందుగా అరిపిరాల గారు, బ్లాగర్ల సమావేశం, e-తెలుగు సమావేశం మద్య నిర్దిష్టమైన విభజన రేఖ ఉండాలని సూచించారు. e-తెలుగు తరపున కథల పోటీ, అంతర్జాల అవధానం లాంటివి నిర్వహిస్తే సంస్థకు మరింత ప్రచారం చేకూరగలదని అభిప్రాయపడ్డారు.
  • e-తెలుగు తరపున చేపట్టబోయే రచయితల వర్క్‌షాప్ ఈ నెల 30 వతేదీన నిర్వహించాలని నిర్ణయించాం. ఇందుకు సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ప్రస్తుతం ఇందులో వీవెన్, కశ్యప్, సుజాత, అరిపిరాల సత్యప్రసాద్, రవిచంద్ర, తదితరులు సభ్యులుగా ఉన్నారు.

  • ప్రస్తుతం అంతర్జాల మాద్యమంలో ఉన్న కొంత సాహిత్యం పత్రికల్లో వచ్చే సాహిత్యం కన్నా మంచి నాణ్యత కలిగి ఉండటం గమనించే ఉంటారు. వీటిని ముద్రణలోకి తీసుకెళ్ళేందుకు e-తెలుగు ఏమైనా చేయగలదా? అనే విషయం కూడా చర్చకు వచ్చింది.

ఈ నెల బ్లాగర్ల సమావేశం

హాజరైన వారు: సీబీ రావు గారు, నేను, చక్రవర్తి గారు, అరిపిరాల సత్యప్రసాద్ గారు.

ఒకరోజు సెలవు పెడితే నాలుగు రోజులు స్వస్థలంలో గడిపిరావచ్చనుకున్నారేమో చాలా మంది సమావేశానికి హాజరు కాలేదు. (బాబూ, మీరామాట చెప్పుంటే నేను కూడా ఎంచక్కా ఊరికి చెక్కేసుండే వాణ్ణి కదా! 🙂 )

హాజరైంది నలుగురమే.. కానీ మంచి ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడుకున్నాం. సత్యప్రసాద్ గారు ఇ-తెలుగు సభ్యులుగా చేరారు. ఇ-తెలుగు ద్వారా ఏమేం చేయవచ్చో కొన్ని సూచనలు కూడా చేశారు.

మైక్రోఫైనాన్స్ లో పనిచేస్తున్న అరిపిరాల గారు దాని గురించి మాకు చక్కటి విషయాలు తెలియజేశారు. ఇంకా కథా సాహిత్యం గురించి, కథలెలా రాయాలి ఇత్యాది విషయాల గురించి మాట్లాడుకున్నాం.