
చిత్రంలో ఉన్న దక్షిణామూర్తి విగ్రహాన్ని గమనించారా? ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది. మరో కాలు పైకి మడిచి ఉంటుంది.చుట్టూ ఋషులు కూర్చుని ఉంటారు. ఈ భంగిమలోని ఆంతర్యమేమిటో తెలుసుకుందాం.
బ్రహ్మ యొక్క నలుగురు కుమారులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు బ్రహ్మ జ్ఞానం కోసం అనేక రకాలుగా తపస్సు నాచరించారు. అయినా వారికి అంతుపట్టలేదు. వారు చివరికి పరమ శివుని దగ్గరకు వెళ్ళి తమకు పరమోత్కృష్టమైన జ్ఞానాన్ని ప్రబోధించాల్సిందిగా కోరారు. అప్పుడు శివుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన చుట్టూ నలుగురు ఋషులు కూర్చున్నారు. శివుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ యోగ భంగిమలోనే కూర్చున్నాడు. ఋషులందరికీ అనుమానాలన్నీ వాటంతట అవే తొలగిపోయి జ్ఞానోదయమైంది. ఈ రూపాన్నే దక్షిణామూర్తిగా హిందూ పురాణాల్లో వర్ణించబడింది.ఈ రూపం మనకు ఏమని సూచిస్తుందంటే జ్ఞానమనేది మాటల్లో వర్ణించలేనిది, కేవలం అనుభవించదగినది అని. గురు దక్షిణామూర్తిగా మనం పూజించే దక్షిణామూర్తి గురువులకే గురువు. అందుకనే ఈయన గురించి మన పురాణాల్లో విస్తృతంగా వర్ణించారు.
అద్భుతం, ఇంతవరకూ తెలియదు,
Anduke vidya ravali anukune vallaki Dakshinamoorty mantram guruvulu upadeshinche vallu… Ikkada mantram rayalani vundi kani, ala cheyavacho ledo teleedu 😦
ఆ మంత్రం ఏదో తెలిస్తె ఈ టపాకి పూర్తి ప్రయొజనం
గురవే సర్వలోకానాం
భిషజే భవరోగిణాం
నిధయే సర్వ విద్యానాం
దక్షిణామూర్తయే నమహః
బాగుంది.
బ్రహ్మ యొక్క కుమారులు సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాత, నారదలు అని నాకు గుర్తు.
అవును నారదుడు కూడా ఆయన కుమారుడే… దక్షిణా మూర్తి కథలో నలుగురి గురించే ప్రస్తావించారు నేను చదివిన పుస్తకంలో..